జగన్,కెసిఆర్ ఊసరవెల్లులు:ఒప్పందాలంటూ రేవంత్ ఫైర్

ఢిల్లీలో జరిగిన ఒప్పందం మేరకే కెసిఆర్ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింప చేసుకున్నారని అలాగే జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు తిరిగి కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. వారిద్దరూ కాంగ్రెసు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెసుకు మద్దతిచ్చేందుకు జగన్ ఎమ్మెల్యేలు వైవి సుబ్బారెడ్డితో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రోజుకో తీరు రంగులు మారుస్తున్న వారిని చూసి ఊసరవెల్లి కూడా భయపడుతోందన్నారు. వారు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారన్నారు.
కేంద్రమంత్రి చిదంబరం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకామని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా చెప్పారు. చిదంబరం మాటలు తాము పట్టించుకోమని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే స్వయంగా తెలంగాణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications