సభ రసాభాస: అసెంబ్లీలో సిఎం వర్సెస్ చంద్రబాబు

Chandrababu Naidu-Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తీరుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఇటీవల మృతి చెందిన మహబూబ్ నగర్ శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డికి సంతాప సందేశాన్ని చదివిన తర్వా సిఎం టిడిపిపై ధ్వజమెత్తారు. ప్రతిపక్షం తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. ఇన్నాళ్లూ మనతో ఉన్న ఓ సభ్యుడు చనిపోయినప్పుడు ఆయనకు సంతాపం ప్రకటించకుండా ఇలా చేయడం సభా సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి దుర్దినం మరోసారి రాకూడదని కోరుకుంటున్నానన్నారు. ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు ఇదేనా మన పద్ధతి అని ప్రశ్నించారు. మనకు మంచి మానవత్వం వద్దా అన్నారు. ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు రాజేశ్వర్ రెడ్డికి సంతాపం తెలిపారు. తర్వాత కిరణ్, ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మానవత్వం ఎవరికి లేదో అర్థమవుతుందని అన్నారు. ప్రజలు అసహ్యించుకునేది మా ప్రవర్తన చూసి కాదని మీవల్లే అన్నారు. అవిశ్వాసంపై తాము నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు అక్నాలెడ్జ్ కాపీ ఇవ్వలేదన్నారు. సంప్రదాయాలపై మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారపక్షమే సభా సంప్రదాయాలు పాటించడం లేదన్నారు. అవిశ్వాసంపై నోటీసు అందిందని చెప్పమని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు. అందుకు సిఎం స్పందిస్తూ అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షం కంటే మేమే ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. ఆరుసార్లు ఎన్నికైనా మీకు సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి కనిపించిందా అని బాబును ప్రశ్నించారు. అంతకుముందు శ్రీధర్ బాబు టిడిపి తీరును తప్పు పట్టారు. మొత్తానికి నిరసనల మధ్య సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+