విజయమ్మకు జరిమానా వేయండి: మురళీమోహన్

విజయమ్మ తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని మురళీమోహన్ ఆరోపించారు. ప్రతివాదులుగా ఉన్నవారికి అవినీతి మకిలి అంటగడుతూ పిటిషన్ వేశారని, అందులో ఎక్కడా వాస్తవాలు కోర్టుకు వెల్లడించలేదని తెలిపారు. విజయ చేసిన ఆరోపణలపై తమ వాదనలు చెప్పడానికి తగిన అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని కోర్టుకు విన్నవించారు. టీడీపీలో తాను చురుకైన కార్యకర్తనని, 2009లో పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీచేశానని ఆయన చెప్పారు.
రాజకీయ కారణాలతోనే తనను ప్రతివాదిగా చేర్చారని, అప్పటి ప్రభుత్వం నుంచి తాను ఏ సహాయం పొందలేదని తెలిపారు. 500లకుపైగా సినిమాల్లో నటించిన తనకు చిత్రాల పంపిణీ వ్యాపారం ఉందన్నారు. జయభేరి బ్యానర్పై 25 సినిమాలను నిర్మించానని కూడా వెల్లడించారు. తమ సొంత డబ్బుతోనే కుటుంబ సభ్యులతో కలిసి 1991లో జయభేరి ఫౌండేషన్ను స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించామని, ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని వివరించారు.












Click it and Unblock the Notifications