వైయస్ జగన్ మాట వినేది ఆరుగురు శానససభ్యులే

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసం విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి నెలకొని ఉంది. తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆయన వర్గానికి చెందిన మెజారిటీ శానససభ్యుల ఆలోచన అందుకు భిన్నంగా ఉంది. దీంతో జగన్ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నారు. శానససభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆరుగురు శాసనసభ్యులు మాత్రమే అవిశ్వాసానికి మద్దతిచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసే జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

తీవ్ర గందరగోళం, అయోమయం మధ్య వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రహస్యంగా సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి తమ వర్గం శాసనసభ్యులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయానికి కట్టుబడి అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆయన శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలో వారంతా రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర రెడ్డితో పాటు శోభా నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినాగి రెడ్డి వంటి ఆరుగురు శాసనసభ్యులు మాత్రమే జగన్ మాట గట్టిగా నిలబడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+