చిదంబరం ప్రకటనను జోక్: టి - కాంగ్రెసు ఎంపిలు

తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి చిదంబరం నిర్దిష్టమైన గడువు పెట్టాలని వారన్నారు. డిసెంబర్ 30వ తేదీలోగా రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణపై అభిప్రాయాలు చెప్పకపోతే పాత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారన్నారు. గతంలో వెల్లడించిన అభిప్రాయానికే ఆ పార్టీలు కట్టుబడి ఉన్నట్లు భావించాలని వారన్నారు. తెలంగాణ కోసం తమ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు చట్టసభల్లో పోరాడాలని వారు సూచించారు. పార్లమెంటులో తాము పోరాడుతున్నట్లుగానే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పోరాడాలని వారు సూచించారు.












Click it and Unblock the Notifications