టిడిపి అవిశ్వాస తీర్మానం: సవాల్గా తీసుకున్న జగన్

ఇందుకోసం జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చి హుటాహుటినా హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించడంతో మిగిలిన వారితో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అభివృద్ధి తాయిలాలు చూపిస్తుంటే జగన్ వారి కోసం దేనికైనా సిద్ధమంటున్నారు. తన వర్గంలోని కొందరు ప్రభుత్వం వైపు మరలడంతో కాంగ్రెసు నుండి కొత్తగా వచ్చే వారి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే జగన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ పదిహేను మంది శాసనసభ్యులకు మించి అతని వెంట ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రారంభం నుండి జగన్ వెన్నంటి ఉండే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే శాసనసభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో జగన్కు సన్నిహితులైన ద్వారంపూడి, ఆదినారాయణ రెడ్డి వంటి వారు కూడా టిడిపిని సమర్థించమని చెప్పేశారు. కాగా గొల్ల బాబురావు, బాలరాజులను ద్వారంపూడి సిఎం వద్దకు తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications