అప్పుడే కాదు: జగన్ వర్గంపై చర్యలు ఇప్పుడు లేనట్లే

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ తొందరపడి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. వారిపై వేటు వేయాలని కోరే ముందు మరోసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం రాత్రి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు. అదే విషయాన్ని చీప్ విప్ కొండ్రు మురళి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. అయితే వారి మాటలు చూస్తే ఇప్పుడప్పుడే చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన కొండ్రు విప్ ధిక్కరించిన వారిపై చర్యలకు మేం సిద్ధంగా ఉన్నామని అయితే ఇందుకు మరో నాలుగు రోజులు పట్టవచ్చునని చెప్పారు. చర్యలు తీసుకుంటామన్న మా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పారు. పిసిసి చీఫ్ బొత్స కూడా చర్యలుంటాయని చెబుతూ సిఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగవలసి ఉంది. విపి ధిక్కరించిన 16 కాంగ్రెసు, ఒక పిఆర్పీ ఎమ్మెల్యేలపై వేటు పడితే మొత్తం 24 నియోజకవర్గాలలో ఎన్నికలు జరపవలసి ఉంటుంది.

సాధారణంగా ఓ పార్టీ గుర్తు ద్వారా గెలిచి మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పక్షంలో ఆ పార్టీ నుండి ఫిర్యాదు అందితే స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వారి వదన వినకుండానే డిస్ క్వాలిఫై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు అప్పుడే ఫిర్యాదు చేయకుండా వారిపై ఆచితూచి ధోరణితో వెళ్లేందుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఒకరోజు పూర్తయింది. అయినప్పటికీ చర్యలుంటాయని చెప్పడమే కానీ ఇప్పటి వరకు వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేయలేదు. దీంతోనే వారు అనర్హత వేటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+