జగన్పై బొత్స, బాబు కూడబలుక్కున్నారు: అంబటి

చర్యలు తీసుకునే స్పీకర్ సమక్షంలోనే శానససభ్యులు విప్ను ధిక్కరిచారని, కాంగ్రెసు అదే రోజు ఓ లేఖ ఇస్తే తెల్లారి ఆ శాసనసభ్యులపై అనర్హహత వేటు పడేదని ఆయన అన్నారు. జగన్ వర్గం శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించడం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పడం ద్వారా నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. పెళ్లి ఒక్కరితో సంసారం మరొకరితోనా అంటూ జగన్ వర్గం శానససభ్యులపై వ్యాఖ్యానించిన కాంగ్రెసు నాయకులు చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు నాయకులు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభపెట్టారని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications