హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ లేస్తే పరుగులు తీస్తారు: టిడిపి నేతలపై కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తన తండ్రి, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మౌనం తుఫాను ముందు ప్రశాంతత వంటిదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు అన్నారు. కెసిఆర్ ఉద్యమ వ్యూహ రూపకల్పనలో ఉన్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ లేస్తే తెలుగుదేశం నాయకులు పరుగులు తీస్తారని ఆయన అన్నారు. తెలంగాణ వాణిజ్య మండలి సమావేశానికి ఆయన బుధవారం హాజరయ్యారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకుల తిట్లు తమకు దీవెనలని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు చంద్రబాబు ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను తిడితే తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకుల కూలీ రేట్లు పెంచుతానని చంద్రబాబు అంటే, వారి తిట్లను తాము దీవెనలుగా తీసుకుంటామని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ నాయకులు నిరాశ, నిస్పృలకు గురయ్యారని, అందుకే పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలు చేయవద్దని ఆయన అన్నారు. టెక్కీకి తమ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఆధిపత్యంలోని ప్రభుత్వాలు తెలంగాణలోని పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేశారని, వరంగల్లులోని నిజాం షుగర్స్‌ను అతి తక్కువ ధరకు విక్రయించారని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఇచ్చిన మాటను తప్పిందని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా తెలంగాణ గురించే ఆలోచిస్తారని ఆయన అన్నారు.

English summary
TRS MLA KT Rama rao has said that his father and party president KCR silence is like peaceful atmosphere before cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X