బొత్సతో తేడాల్లేవు, అవసరమైనప్పుడు విస్తరణ: సిఎం

kiran kumar reddy
న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీడియాకు చెప్పే విస్తరణ చేస్తామని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఏలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. బొత్స, తాను కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని, విభేదాలు ఉన్నట్లు మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తాను మీడియా కథనాలకు స్పందించబోనని ఆయన అన్నారు. జోడు పదవులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నివేదిక తనకు అందలేదని, అందగానే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా బొత్స విధులు బొత్స నిర్వహిస్తున్నారని, తన విధులు తాను నిర్వహిస్తున్నానని ఆయన చెప్పారు. మీడియాలో రాసివాటికి తానోసారి, బొత్స మరోసారి వివరణ ఇవ్వాల్సి వస్తోందని ఆయన అన్నారు. అధికారికంగా విలీనమైన తర్వాతనే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.

అవసరమైతే మద్యం సిండికేట్లపై సిబిఐ విచారణకు అడుగుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గడువులపై తాను స్పందించబోనని, అభివృద్ధే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధిష్టానం నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లతో పార్టీ వ్యవహారాల గురించి, పెండింగులో ఉన్న ప్రభుత్వ పనుల గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ చూసుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శంకరరావు వ్యవహారంపై అధిష్టానమే చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగానే విద్యుత్తు చార్జీల పెంపు ఉంటుందని, అన్ని రాష్ట్రాలు పెంచుతున్నాయి కాబట్టి మన రాష్ట్రం కూడా పెంచాల్సి వస్తోందని, విద్యుత్తు చార్జీలు పెంచకుంటే కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పడుతుందని ఆయన చెప్పారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పన్నులు పెరుగుతాయని, వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడాతమని ఆయన చెప్పారు. కేంద్రం ఆదేశాల మేరకే 1 శాతం వ్యాట్ పెంచామని ఆయన చెప్పారు. రక్షణ రంగానికి అవసరమైన భూములు కేటాయిస్తామని ఆయన చెప్పారు. లక్ష ఉద్యోగాల ప్రధానికి లేఖ రాశామని, భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆనయ చెప్పారు. ఒప్పందంలోని సమస్యల వల్ల కొన్ని 108 వాహనాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం, కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటాయని మాత్రమే తాను చెప్పానని ఆయన అన్నారు. మూడు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉందని, తుఫాను వల్ల రాష్ట్రంలో నష్టం ఏమీ జరగలేదని ఆనయ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+