వైయస్ జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం

Kunja Biksham
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కుంజా భిక్షం శుక్రవారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్‌ను ఆయన శుక్రవారం ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గిరిజన నాయకుడైన భిక్షం 1989, 1994 ఎన్నికల్లో రెండు సార్లు ఖమ్మం జిల్లా బూర్గుంపహాడ్ నుంచి సిబిఐ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు పార్టీలో చేరారు.

మూడు జిల్లాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీలకు వైయస్ జగన్ శుక్రవారం కన్వీనర్లను నియమించారు. విశాఖపట్నం కన్వీనర్‌గా గొల్ల బాబూరావు, విశాఖపట్నం అర్బన్ కన్వీనర్‌గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చందా లింగయ్య నియమితులయ్యారు. పలు జిల్లాలకు సమన్వయకర్తనలను కూడా జగన్ నియమించారు. కాగా, విశ్వ బ్రాహ్మణ ఐక్య యువ వేదిక రాష్ట్రాధ్యక్షుడు వెగ్గళం రాము నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం శుక్రవారం వైయస్ జగన్‌ను కలిసింది. తమ డిమాండ్లకు మద్దతు ప్రకటించాలని ఆ బృందం జగన్‌ను కోరింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించాలని విశ్వబ్రాహ్మణలు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+