జగన్, కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ రుజువు: చంద్రబాబు

రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక తదితర మాఫియాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆయన అన్నారు. మహిళల దుస్తులపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన ప్రకటన సరైంది కాదని, ఇటువంటి ప్రకటనలు మానేసి డిజిపి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. 2011లో ప్రజలకు అన్నీ ఇబ్బందులే కలిగాయని, 2012లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. 2012లో తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
విద్యుత్ సమస్యను, ధరల పెరుగుదలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయిందని ఆయన అన్నారు. ప్రజలపై ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications