కెసిఆర్‌కు ఊరట: పోటీ ఉండదని జగన్ ప్రకటన

YS Jagan
హైదరాబాద్: రాబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయబోదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన రెడ్డి ప్రకటించారు. టీడీపీలోని ముగ్గురు, కాంగ్రెస్‌లోని ఇద్దరు సభ్యులు తెలంగాణ కోసం రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో వారు ఏ పార్టీ తరఫున రంగంలోకి దిగినా పోటీ పెట్టవద్దని తాము నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 24 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు దారితీసిన పరిస్థితులను ఆ ప్రకటనలో జగన్ వివరించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అనుసరించబోయే వైఖరిని స్పష్టంచేశారు.

"మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్‌లోని 16 మంది స్థానాలు, పీఆర్పీలోని ఒక్క ఎమ్మెల్యే సీటు, అలాగే టీడీపీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా మా పార్టీలో కలిసిన ప్రసన్నకుమార్‌రెడ్డి స్థానం ఇలా మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో మా పార్టీ తరఫున రంగంలోకి దిగుతారు. అయితే.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణం వల్ల అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా ఆయన సతీమణిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె మా పార్టీ తరఫున కాకుండా వేరే పార్టీ తరఫున పోటీ చేసినా ఆమెకు వ్యతిరేకంగా మేం పోటీ పెట్టకూడదని నిర్ణయించాం'' అని తెలిపారు.

"అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలే. వారు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు. ఈ మేరకు వారిని గౌరవించి, వారు ఏ పార్టీ తరఫున రంగంలోకి దిగినా.. వారిపై పోటీ పెట్టరాదని మా పార్టీ నిర్ణయం తీసుకుంది'' అని జగన్ ఆ ప్రకటనలో తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రజలు హర్షిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+