జగన్ ప్రకటనకు ఎగిరి గంతేసిన తెరాస నేతలు

Rajaiah-Jitender Reddy
హైదరాబాద్: తెలంగాణలోని ఉప ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఆహ్వానించారు. జగన్ ప్రకటనను తెరాస నాయకులు టి. రాజయ్య, ఎంపి జితేందర్ రెడ్డి విడివిడిగా స్వాగతించారు. తెలంగాణపై వైయస్ జగన్ మరింత స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస నేత టి. రాజయ్య విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చంద్రబాబు వరంగల్ జిల్లాకు వస్తే మహబూబాబాద్ ఘటన పునరావృతమవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే దంచాలని, అలా చేస్తే కేసులు లేకుండా చూస్తామని వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆయన మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రబెల్లిపై సుమోటో కేసు పెట్టాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని జగన్ చేసిన ప్రకటనను జితేందర్ రెడ్డి స్వాగతించారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్థానికతపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించారు. కెసిఆర్ స్థానికతపై అనుమానాలు ఉంటే మొయినకుంటలోని రికార్డులు చూడాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి ఆకస్మికంగా మరణించిన శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి పోటీ చేస్తారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+