సురేఖ కోసం సీట్లు వదిలేస్తున్నారు: జగన్‌పై వీరశివా

Veera Shiva Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి విరుచుకుపడ్డారు. కొండా సురేఖను గెలిపించుకోవడానికి తెలంగాణలోని ఏడు సీట్లను జగన్ వదిలేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్ పిరికితనంతో తెలంగాణలోని ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణలో తిరగలేమనే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో జగన్ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడానికే జగన్ ఆ ఒప్పందానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు.

కెసిఆర్‌తో, తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరితో చేసుకున్న ఒప్పందాలను జగన్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు లేవని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరినే జగన్ అనుసరిస్తున్నారని, అది ద్వంద్వ వైఖరి అని ఆయన అన్నారు. తెలంగాణకు జగన్ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు.

కెసిఆర్, జగన్ మధ్య ఒప్పందం ఎప్పుడో జరిగిందని, అది ఇప్పుడు వెలుగు చూసిందని కాంగ్రెసు మరో సీమాంధ్ర శానససభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. సమైక్యవాది వైయస్ కడుపున జగన్ చెడ పుట్టాడని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కెసిఆర్ పాదాల ముందు జగన్ తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వేర్పాటువాదినని జగన్ ప్రకటించాలని ఆనయ డిమాండ్ చేశారు. జగన్‌ను ఆయన సీమాంధ్ర ద్రోహిగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+