అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చకెక్కిన గొడవ, శైలజానాథ్‌పై జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Prabhakar Reddy
అనంతపురం: కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి శైలజానాథ్ వర్గానికి మధ్య తలెత్తిన విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటి వరకు ఇరు వర్గాలు పరోక్ష విమర్శలకు దిగుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష విమర్శలకే దిగారు. మంత్రి శైలజానాథ్‌పై, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డిపై జెసి దివాకర్ రెడ్డి సోదరుడు, కాంగ్రెసు నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సుబ్బరాయ సాగర్‌లో పూడికను తొలగించిన అధికారికి నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. పూడిక తీస్తే నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. శైలజానాథ్, వెంకట్రామిరెడ్డి జిల్లాకు చేసింది శూన్యమని ఆయన శనివారం విమర్శించారు. వారిద్దరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.

జిల్లాలో పార్టీ పతనానికి కారణం ఎవరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తాను వివరిస్తానని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రఘువీరా రెడ్డి జెసిబి నడిపారని ఆయన విమర్శించారు. సుబ్బరాయ సాగర్ నీటి విడుదల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే. సుబ్బరాయసాగర్ నుంచి తాడిపత్రి కాలువకు నీటి విడుదలను అడ్డుకోవడానికి శైలజానాథ్ ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. అయితే, తాడిపత్రి కాలువకు నీటిని విడుదల చేయించడంలో జెసి దివాకర్ రెడ్డి విజయం సాధించారు.

English summary
Congress senior MLA JC Diwakar Reddy's brother JC Prabhakar Reddy fired at minister Sailajanath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X