థానే తుఫానుకు 35 మంది బలి, రంగంలోకి ప్రభుత్వం

తీవ్ర పెను తుఫానుగా తీరం దాటిన 'థానే'.. 11.30 గంటలకు తీవ్ర వాయు గుండంగా మారింది. ఇది క్రమేపీ బలహీనపడుతుందని తెలిపింది. థానే కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరిలతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 35 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కడలూరులోనే 21 మంది మరణించారు. చేపల వేటకు వెళ్లిన 21 మంది జాలర్లు గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం జయలలిత రూ.2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
థానే ఉద్ధృతి, ఈదురు గాలులకు సుమారు 2 లక్షల వృక్షాలు నేలకూలాయి. ఐదు వేలకుపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెయ్యి పడవలు ధ్వంసమయ్యాయి. కన్యాకుమారి, కడలూరు, నాగపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం 50 మీటర్ల మేర ముందుకొచ్చింది. చెన్నై మెరీనా బీచ్లో సముద్రం 2 మీటర్ల మేర ముందుకొచ్చింది. పుదుచ్చేరి, కడలూరు జిల్లాలు పూర్తిగా నష్టపోయాయి. పరిస్థితిని అంచనా వేసిన జయలలిత తక్షణ సహాయ చర్యల కోసం రూ.150 కోట్ల నిధుల్ని విడుదల చేయడమే కాకుండా సహాయ చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 15 జిల్లాల్లో విద్యాలయాలకు, కార్యాలయాలకు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, దక్షిణాది జిల్లాలకు వెళ్లే ఐదు రైళ్లను దక్షిణ రైల్వే అధికారులు రద్దు చేశారు. చెన్నై నుంచి వెళ్లే నాలుగు విమానాలు రద్దయ్యాయి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి టీటీడీ రగ్గులు, పాలు, టీ, కాఫీ పంపిణీ చేస్తోంది. వర్షాలతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. నెల్లూరు జిల్లాలో చలి పెరగడంతో ఏడుగురు మరణించారు. కడపలో వరి, పొద్దుతిరుగుడు , మామిడి పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రానికి గండం తప్పిందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తుఫాను తీరం దాటినా సహాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతాయని చెప్పారు. కాగా, ఇదే అంశంపై ఢిల్లీలో ఉన్న సీఎం కిరణ్ మంత్రి రఘువీరా, సీఎస్ పంకజ్ ద్వివేదిలతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications