సాయిరెడ్డి నుండి కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

Vijaya Sai Reddy
హైదరాబాద్: జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను సిబిఐ ఆఫీసుకు తరలించారు. పదకొండు గంటల ప్రాంతంలో అతనిని కోర్టులో హాజరు పర్చే అవకాశం ఉంది. అతనిని సిబిఐ కస్టడీకి అడగనుంది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ సోమవారం విజయ సాయి రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన తర్వాత సాక్షి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని విజయ సాయి రెడ్డి నివాసం కృష్ణ సింధూ రెసిడెన్సీలో సిబిఐ అధికారులు ఆయన సమక్షంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వారు కీలక పత్రాలు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

17/2011 ప్రకారం ఆయనను అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపింది. జగన్ కేసులో విజయ సాయి రెడ్డిది తొలి అరెస్టు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయ సాయి రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జగతి పబ్లికేషన్స్‌కు ఆయన పెట్టుబడులు సంపాదించారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులన్నీ విజయసాయి రెడ్డికి తెలుసునని అంటారు. ఓబిసి డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. వైయస్ హయంలో ఆయన టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 74 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 17వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+