రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి నిజాలు దాస్తున్నాడు: ఎపిఐఐసి చైర్మన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిజాలు దాస్తున్నారని ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం సోమవారం రాజమండ్రిలో అన్నారు. ఎమ్మార్‌లో అంబటి పాత్ర ఉందన్నారు. సిబిఐ ప్రశ్నలను మీడియా ముందు దాచటం సరికాదన్నారు. తన తమ్ముడితో పాటు మరికొందరికి అంబటి విల్లాలు ఇప్పించారన్నారు. అంబటి ముద్దాయి కాబట్టే వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. సిబిఐ దర్యాఫ్తు ద్వారా వాస్తవాలు మొత్తం బయటకొస్తాయన్నారు. సిబిఐ ప్రశ్నల కంటే మీడియా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయన్నా అంబటి వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఎమ్మార్‌లో అక్రమాలు జరిగాయని ఒకసారి, జరగలేదని మరోసారి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలున్నాయన్నారు. అంబటి ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్న సమయంలో సిఫార్సు చేస్తూ రాసిన లేఖలు కూడా ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తలవంచక తప్పదన్నారు. మీడియా ముందు ఆయన నిజాలు చెప్పాలన్నారు. కాగా ఆదివారం అంబటి రాంబాబు సిబిఐ అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను కేవలం సాక్షిగానే పిలిచారని, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే అక్రమాలు జరిగాయని, ఆ జీవోలపై విచారణ జరపాలని సిబిఐని కోరినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
APIIC chairman Sivarama Subhahmanyam condemned YSR Congress Party spokesperson Ambati Rambabu statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X