జగన్‌ పగటి వేషం, కెసిఆర్‌ రెండు కళ్ల సిద్ధాంతం: టిడిపి

Dhulipalla Narendra
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో రైతుల పేరిట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష పగటి వేషమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర బుధవారం ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆర్మూర్‌లోనే ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపించారని, దానికి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సహకార సేద్యం పేరుతో వైయస్ నయా భూస్వాములను తయారు చేశారని విమర్శించారు. రైతులు ఎరువుల కోసం దుకాణాల ముందు నిలబడితే జగన్ మేనమామ మాత్రం వాటిని తన ప్లాంట్లకు తరలించుకున్నారని, అప్పుడు జగన్ ఏమాత్రం మాట్లాడలేదన్నారు. ఇన్ని వైఫల్యాలు ఉండి రైతుల కోసం జగన్ దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు.

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తిగా నిరర్థకంగా మిగిలిపోయాయని మరో నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వం ఎత్తిపోతల భారం రైతులపై వేయడం శోచనీయమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టులు ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి తెలియవని ఎద్దేవా చేశారు. పండుగగా ఉన్న వ్యవసాయాన్ని దండుగగా మార్చారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిషలు కృషి చేస్తుందన్నారు.

జగన్ కాంగ్రెసుతో పొత్తు కోసం టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు ఉవ్వీళ్లూరుతున్నారని మరో నేత పెద్దిరెడ్డి వేరుగా ధ్వజమెత్తారు. జగన్ క్యాంపుకు తెలంగాణలో కెసిఆర్ కాపలాదారు అన్నారు. రాష్ట్రంలో జగన్, ఢిల్లీలో కాంగ్రెసు అంటూ కెసిఆర్ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+