భువితేజ స్కామ్ వెనక వైయస్ టీమ్: పయ్యావుల
అసలు రాష్ట్ర రికార్డులలోనే లేని తేజ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఫలానా చోట పెట్రోలు బంకుకోసం ఎకరం స్థలం కావాలని కోరిందని, ఇందుకు సంబంధించిన అనుమతులు 48 గంటల లోపే చకచక మంజూరు అయిపోయాయని ఆయన వివరించారు. అసలు ఈ మొత్తం ఎలా ప్రారంభమైందో వివరిస్తూ ఈ భూమికోసం ఒక కోటి 60 లక్షల రూపాయలను బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఒక కోటి 14 లక్షల రూపాయలకే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, మళ్లీ అదే భూమిని 23 కోట్ల రూపాయలు విలువ చేస్తుందంటూ థర్డ్ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నారని, తేజ నుంచి భువితేజ సంస్థ వరకు జరిగిన మాయాజాలం మొత్తం వెనుక వైయస్సార్ అండ్ కంపెనీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
భూమి కేటాయించేనాటికి రికార్డులలో ఆ కంపెనీయే లేదని వెల్లడిస్తూ భూమి కేటాయింపులు జరిగిన తర్వాతే ఆ కంపెనీ రికార్డులలోకి చేరిందని ఆయన వివరించారు. పెట్రోలు బంకు కోసం అనుమతి పొందిన వారు 11 అంతస్తుల భవంతి నిర్మాణం ఎలా చేపడతారని, ఇది నిబంధనలకు విరుద్ధం అనీ ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ స్థలం మొత్తాన్ని బీహార్ పద్ధతిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. సామాన్య ప్రజలు చిన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో చట్టాలను ఉటంకించే ప్రభుత్వం ఇలా తాడూబొంగరం లేని కంపెనీలు ఎలా ఆడితే అలా ఆడనిచ్చాయని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు.