బాబు జైళ్లో ఉండేవారేమో, దాసరి లేఖ తప్పుకాదు: బొత్స

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో, సమష్టిగా ముందుకు పోతోందన్నారు. నాకు తెలిసి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం లేదన్నారు. దాసరి లేఖ రాయడంలో తప్పులేదన్నారు. అయినా ఆయన లేఖ తన దృష్టికి రాలేదన్నారు. ఆయనంటే తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. చిరంజీవి వర్గంలోని సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారన్నారు. తన శాఖ మార్పు సిఎం దృష్టికి తీసుకు వెళ్లానని ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. జోడు పదవుల ఉండకూడదన్న నిబంధన ఏమీ లేదన్నారు. అరకు పర్యటనను రాజకీయ కోణంలో చూడవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications