తెలంగాణ పర్యటన: చంద్రబాబుకు భిన్నంగా జగన్ తీరు

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత తెలంగాణలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణపై భిన్న వైఖరులు ప్రదర్శించారు. ఇటీవల నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై తేల్చిన తర్వాతే పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు తాను అనుకూలమని, వ్యతిరేకిస్తున్నానని చెప్పకుండా తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే తేల్చాలని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణవాదులకు సంతృప్తి ఇవ్వనప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత సానుకూలత ఏర్పడింది. అదే సమయంలో మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలంగాణపై ఏమాత్రం స్పందించకుండా పార్టీ నేతలు, తెలంగాణవాదుల ఆశలపై నీళ్లు చల్లారనే చెప్పవచ్చు.

అంతగా కాకున్నా తెలంగాణ పర్యటనకు ముందు చంద్రబాబు కంటే క్లారిటీ ఇచ్చిన జగన్ తన పర్యటనలో మాత్రం ఏమీ మాట్లాడపోవడం ఆయన టి-పార్టీ నేతలకు అసహనం కలిగించినట్లుగా కనిపిస్తోంది. ఆఖరి రోజు బహిరంగ సభలో జగన్ కేవలం రైతు సమస్యలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు పైనే విరుచుకు పడ్డారు. పర్యటనకు ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ పార్టీ గౌరవిస్తుందని, అందుకే తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం ద్వారా టిడిపి కంటే తెలంగాణవాదుల మన్ననలు పొందగలిగారు. కానీ మూడు రోజుల పాటు జరిగిన దీక్షలో గానీ, చివరి రోజు బహిరంగ సభలో గానీ జగన్ తెలంగాణపై ఏమీ మాట్లాడక పోవడం తెలంగాణవాదులను ఆగ్రహానికి గురి చేసిందట. అయితే పార్టీ నేతలు మాత్రం జగన్ ఇప్పటికే తెలంగాణపై క్లారిటీ ఇచ్చారని ఇంతకంటే ఇవ్వలేరని చెప్పుకు రావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+