విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండక్కి రండి: కెసిఆర్, ఎర్రబెల్లిలకు సమైక్యాంధ్ర జెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
విశాఖపట్నం: సంక్రాంతి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, కాంగ్రెసు పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావులు సీమాంధ్రకు రావాలని సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి శుక్రవారం ఆహ్వానించింది. వారిని ఆహ్వానిస్తూ గ్రీటింగ్ కార్డ్స్ కూడా జెఏసి విడుదల చేసింది. ఈ సందర్భంగా జెఏసి నేతలు మాట్లాడారు. శిక్షణ, అవగాహన కార్యక్రమానికి అరకు వచ్చిన తెలంగాణ శాసనసభ్యులకు తాము సాదరంగా స్వాగతం పలికామని చెప్పారు. తెలంగాణ కావాలంటూ ఉద్యమిస్తున్న కాంగ్రెసు ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా సీమాంధ్రలో పర్యటించాలని వారు కోరారు.

కాగా రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని, రాష్ట్ర విభజన చేయకూడదని సమైక్యాంధ్ర జెఏసి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్నింటిలోనూ అభివృద్ధి చెందుతామని చెబుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు.

English summary
Seemandhra JAC invited TRS chief KCR, TDP leader Errabelli, JAC chairman Kodandaram and Congress MP Ponnam Prabhakar for Sankranti festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X