గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కలిశాకే చంద్రబాబుకు ధైర్యం వచ్చింది: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశాక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ధైర్యం వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన గుంటూరు జిల్లాలోని ఓదార్పు యాత్రలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత బలం లేనప్పుడు చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పిఆర్పీ విలీనం తర్వాత తమకు ఎలాంటి భయం లేదని భావించిన కాంగ్రెసు పెద్దల సూచనల మేరకే బాబు అవిశ్వాసం పెట్టారన్నారు. తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులను ఇబ్బందులకు గురి చేసేందుకు బాబు, కిరణ్ కలిసి ప్రయత్నించారన్నారు. కానీ రైతుల కోసం పదిహేడు మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని వారికి నా సెల్యూట్ అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకు తెలుగుదేశం, కాంగ్రెసు కుట్ర పన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని దానిని బాగుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైయస్ రెక్కల కష్టం కారణంగానే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయం మానేస్తే మానం పోయినట్లు చేస్తే ప్రాణం పోయినట్లుగా రైతుల పరిస్థితి ఇప్పుడు ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జగన్ జిల్లాలోని పలు గ్రామాల్లో దివంగత వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెదపాలెంలో మరియమ్మ కుటుంబాన్ని ఓదార్చారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy accused TDP chief Chandrababu that Why he bring no confidence motion after PRP merger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X