అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: విచారణ వేగం, అనంతలో సిబిఐ బృందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల విచారణ సిబిఐ వేగవంతం చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ లోపుగానే దర్యాఫ్తు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సిబిఐ కేసుల విచారణను వేగవంతం చేసింది. సిబిఐ అధికారులు వివిధ కోణాల్లో శోధిస్తున్నారు. ప్రధానంగా జగన్ ఆస్తులకు సంబంధించిన కేసులో సచివాలయంలోని వివిధ విభాగల నుంచి విలువైన పత్రాలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. అధికారులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు భారీ నీటి పారుదల శాఖ, నీటి పరివాహక ప్రాంత కార్యదర్శిగా పని చేస్తున్న అధికారిని సిబిఐ దిల్‌కుష గెస్ట్ హౌస్‌కు పిలిపించింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కొందరు వ్యక్తులకు నీటిపారుదల కాంట్రాక్టులు దక్కిన వ్యవహారంపై అధికారులు ఆయన నుంచి వివరాలు తీసుకున్నారని సమాచారం.

ఏ సమయంలో ఈ అనుమతులు దక్కాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా గురువారం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో పెన్నా కంపెనీకి కేటాయించిన భూములపై రైతులు, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కూడా ఆ బృందం యాడికి రెవెన్యూ సిబ్బందిని పెన్నాకు భూముల కేటాయింపుపై ప్రశ్నించింది. రైతులు, అధికారులను విచారిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసు పక్కన కొన్ని తగలబెట్టిన రికార్డులను వారు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తగులబెట్టిన వ్యవహారంపై సిబిఐ, అధికారులను ప్రశ్నించారు.

English summary
CBI doing fast enquiry in YSR Congress Party chief YS Jaganmohan Reddy properties case and EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X