ఉప పోరు: జగన్ ఎమ్మెల్యేలకు నేతల బుజ్జగింపులు?

YSR Congress
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన ఎన్నికలనైనా ఎదుర్కోవడానికి అధికార కాంగ్రెసు పార్టీలోని కొందరు నేతల్లో భయం నెలకొందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక, సహకార, అసెంబ్లీ ఉప ఎన్నికల సమరానికి దిగడం ద్వారా పాలనపై ప్రజా నాడి తెలుసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తుంటే ఆ పార్టీలోని కొందరు రాష్ట్ర నేతలు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారట. ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరిని ఉప ఎన్నికల భయం పట్టుకొన్నట్లుగా కనిపిస్తోంది. ఓటమిని తప్పించుకోవాలంటే ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను ఎంత తగ్గిస్తే అంత బాగుంటుందన్న అభిప్రాయంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు వీలుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఐతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్‌ వర్గ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరిని అవలంభించకుండా చివరి దశలో రాయబారాలు నడిపితే ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం నెలకొంటుందన్న అభిప్రాయం కాంగ్రెసులోని చాలామందిలో ఉంది. పైగా ఈ సమయంలో వేటు వేయకపోవడం అన్నది సాంకేతికంగా చెల్లుబాటు కాదని కొందరు నేతలు చెబుతున్నారు. వారిపై వేటు వేసేందుకు కొందరు, ఉప ఎన్నికల భయంతో బుజ్జగింపులకు మరికొందర ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+