హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా అధికారంలోకి వస్తున్నారు: టిడిపి చీఫ్ చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మైనింగ్, ఇసుక, లిక్కర్ మాఫియాల డబ్బులతో అధికారంలోకి వస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాఫియా సొమ్ముతో సంపాదించిన డబ్బుతో అధికారంలోకి రావడం దురదృష్టకరమన్నారు. అవినీతిలేని సమాజం కోసం యువత కృషి చేయాలని సూచించారు. పదవులు, అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 65 ఏళ్ల స్వాతంత్ర్యం, 63 ఏళ్ల గణతంత్రంలో మనం ఏం సాధించామో సమీక్షించుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం సరికాదని, దీనిని అందరూ ఖండించాలన్నారు.

భారత్ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. క్యాన్సర్‌లా పెరుగుతున్న అవినీతిని అంతమొందించేందుకు అందరూ పాటుపడాలన్నారు. అవినీతే దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య అన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu accused some parties for their attitude. He hasted national flag at NTR Trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X