జూ ఎన్టీఆర్, హరిలను పంపేందుకే బాలకృష్ణ: పార్థసారథి

చంద్రబాబు దద్దమ్మ కాబట్టే రాష్ట్ర ప్రజలు ఆయనను రెండుసార్లు ఓడించారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో విమర్శించారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులను దద్దమ్మలు అన్న చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయనను ప్రజలు అధికారానికి దూరంగా ఎందుకు ఉంచారో తెలుసుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటించాలని సూచించారు. ఆయన ఇలాగే మాట్లాడితే ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. సిబిఐ అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications