జగన్ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారు: కొండ్రు మురళి

కొండ్రు మురళి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో శనివారం మాట్లాడారు. శాసనసభ స్పీకర్ ముందు తాము అన్ని విషయాలు పెట్టామని ఆయన చెప్పారు. కొంత మంది శాసనసభ్యులు వేటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. స్పీకర్ సమక్షంలోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని, చర్యలు తీసుకోవడానికి అది చాలునని ఆయన అన్నారు. వారందరిపై వేటు వేయాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విప్ అందలేదని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. దానిపై తాము స్పీకర్కు వివరణ ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసులోకి తిరిగి వస్తామని చెబుతున్నవారి పేర్లు బయట పెట్టడం నైతికత కాదని, వారు బయటకు రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications