హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారా వ్యాపారి పిసిసి చీఫ్: బొత్సపై చంద్రబాబు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం సికింద్రబాదులోని ప్యారడైజ్ సెంటర్‌ నుంచి గాంధీ విగ్రహం వరకు మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన ప్రసంగించారు. సారా వ్యాపారి ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడిగా ఉన్నారని ఆయన బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. గాంధేయవాదులమని చెప్పుకునే కాంగ్రెసు వారు బ్రాందీవాదులుగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ విగ్రహాలను తాగిన మత్తులో కూలదోశామని నిందితులు అంటున్నారని, రాష్ట్రాన్ని కాంగ్రెసు ప్రభుత్వం మైకంలో ముంచెత్తుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని, మద్యం ఏరులుగా పారిస్తోందని ఆయన అన్నారు. బొత్స సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పుకున్నారని, అన్ని దుకాణాలు బొత్సకు ఎలా వచ్చాయని ఆయన అన్నారు. ఒక్క వ్యక్తి ఒకే దుకాణం పాడుకోవడానికి వీలుంటుందని, అటువంటి స్థితిలో బొత్స 31 దుకాణాలను ఎలా సొంతం చేసుకున్నారని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has lashed out at PCC president Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X