జూడాలకు చంద్రబాబు మద్దతు, ప్రభుత్వంపై ధ్వజం

జూడాల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మొండి వైఖరి వీడాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. వెంటనే చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు.
కాగా, గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారిలో రవి అనే వైద్యుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతన్ని ఐసియుకు మార్చారు. ఆజాద్ అనే మరో వైద్యుడి ఆరోగ్యం కూడా క్షీణించింది. జూడాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు కూడా మద్దతు తెలిపారు. ప్రజాసేవ చేస్తున్నారని చెబుతూ శాసనసభ్యులకు లక్ష రూపాయలు ఇస్తున్న వైద్యులను మాత్రం అంటరానివారిగా చూస్తోందని ఆయన విమర్శించారు. ఇదిలా వుంటే, జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.












Click it and Unblock the Notifications