వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేధించ లేదు: విజయమ్మ వ్యాఖ్యలపై జెసి, శైలజానాథ్
అప్పుడు సిబిఐ జగన్ను నిర్దోషిగా తేల్చిందన్నారు. అప్పుడు వారికి అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పుడు కేసు వారికి అనుకూలంగా లేదని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శమని ఆరోపించారు. విజయమ్మ ఆరోపణలను మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కూడా వేరుగా ఖండించారు. జగన్ లక్ష్యంగా విచారణ సాగితే విజయమ్మ ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. వైయస్ కుటుంబాన్ని ఎవరూ వేధించలేదన్నారు. అనాటి మంత్రులు తప్పు చేస్తే శిక్షించాల్సిందేనన్నారు. మంత్రులపై విజయమ్మ ఆధారాలు చూపించాలన్నారు. కాగా సిబిఐ దర్యాఫ్తు తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని జరుగుతోందని వైయస్ విజయమ్మ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే.
jc diwakar reddy sailajanath ys vijayamma ysr congress జెసి దివాకర్ రెడ్డి శైలజానాథ్ వైయస్ విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు
English summary
Minister Sailajanath and JC Diwakar Reddy condemned Puluvedula MLA YS Vijayamma comments against Congress and CBI.
Story first published: Tuesday, January 31, 2012, 14:26 [IST]