సిబిఐ దర్యాప్తు: వైయస్ జగన్ ఆస్తుల కేసుపై ఫోకస్

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి గురువారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. సాధారణ పరిపాలనా విభాగంలో పొలిటికల్ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రాను కూడా సిబిఐ గురువారం ప్రశ్నించింది. అజయ్ మిశ్రా వైయస్ హయాంలో మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శిగా, హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గ్రామీణ నీటి పారుదల శాఖలో ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు.
సాక్షి దినపత్రికను ప్రచురిస్తున్న వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు సజ్జల రామకృష్ణా రెడ్డి, సత్యమహేశ్వరిలను కూడా సిబిఐ గురువారం ప్రశ్నించింది. వీరితో పాటు ఇఁడియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, విజయలక్ష్మి మినరల్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందు హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గనుల వ్యాపారి శశికుమార్ను సిబిఐ గురువారం ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications