Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ గురించి సిబిఐ అడగలేదు: రమాకాంత్ రెడ్డి

Ramakanth Reddy
హైదరాబాద్: సిబిఐ అధికారులు తనను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏమీ అడగలేదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చెప్పారు. రెండో రోజు శుక్రవారం ఆయన సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. రమాకాంత్ రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. నిన్న అడిగిన ప్రశ్నలే ఈ రోజు అడిగారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేటాయించిన భూములపై, చేపట్టిన పథకాలపై సిబిఐ అధికారులు ప్రశ్నలు వేశారని, వాటికి తాను సమాధానం ఇచ్చానని ఆయన చెప్పారు. జీవోల జారీలో నిబంధనలు పాటించారా, లేదా అని అడిగినట్లు ఆయన తెలిపారు.

మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరిగాయా, లేదా అని అడిగారని, మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జీవోలు విడుదల చేశారా, జీవోల జారీలో ఎవరి ఒత్తిడైనా పనిచేసిందా అని అడిగారని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జీవోలు జారీ అయ్యాయని తాను చెప్పానని ఆయన వివరించారు. భూముల కేటాయింపుల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు రావాలని సిబిఐ అధికారులు తనను అడగలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సంతకాలతోనే పలు జీవోలు జారీ అయ్యాయి. దీంతో సిబిఐ ఆయనను విచారించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+