Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రం అట్టుడుకుతోంది: టిటిడిపై చిన జీయర్ ధ్వజం

 Chinna Jeeyar Swamy
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానంపై చిన జీయర్ స్వామి శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తిరుపతిలో ఉదయం ఆయన విష్ణుసహస్ర నామ స్త్రోత్ర పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా హాజరయ్యారు. చినజీయర్ జీయర్ పేరుతో ఓ భక్తి వెబ్ ఛానల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. టిటిడి తీరుపై ధ్వజమెత్తారు. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చిన తర్వాతే రాష్ట్రంలో ఉపద్రవాలు మొదలయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రభావం దేశం పైనా పడిందన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన అన్నారు. టిటిడి వ్యవస్థ సక్రమమార్గంలో నడిచేలా చూడాలన్నారు. తిరుమల గురించి తెలిసిన వారే టిటిడి సభ్యులుగా ఉండాలని, ఆలయ పాలనలో లాజిక్కులు ప్రమాదకరమని హెచ్చరించారు. చరిత్ర తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడటం బుద్ధి లేని పని అన్నారు. లోపాలను ఎత్తి చూపడం మా లక్ష్యం కాదన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చి వేసిన అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీవారికి రెండు గంటల విరామం ఉండాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత తలుపులు తెరిచి ఉంటే శ్రీవారికి నిద్రాభంగం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని టిటిడి విస్మరించిందన్నారు. కల్యాణోత్సవాలు బయట నిర్వహించడం తగదన్నారు. తిరుమలలో ఉపద్రవాలు మొదలయ్యాక రాష్ట్రం అట్టుడుకుతోందన్నారు. ఆర్థిక పృష్టి కూడా శ్రీవారికి శాపమైందని, దేవుడి సేవకులుగా ఆయన వద్దకు ఎవరైనా వేళ్లాలని, విలాసాల కోసం కాదన్నారు. తిరుమలలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు ఎందుకన్నారు. కాగా చిన జీయర్ స్వామికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తిరుమల తిరుపతి పరిరక్షణా సమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+