జయలలిత రివేంజ్, శశికళ సోదరుడు దివాకరన్ అరెస్ట్

కాగా జయలలితను కాదని పార్టీలో శశికళ డామినేషన్ పెరగటంతోనే ఆమెను, మరో పదకొండు మందిని బహిష్కరించిన విషయం తెలిసిందే. జయలలితకు శశికల చాలాకాలం పాటు సన్నిహితురాలిగా కొనసాగింది. 1991-1996 మధ్య కాలంలోని పలు అక్రమాల ఆరోపణలలో జయలలితతో పాటు శశికళ కూడా ప్రధాన నిందితురాలు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. ఇటీవలే జయలలిత ఈ కేసులో కర్నాటక రాజధాని బెంగళూరులో పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు. తొలుత బెంగళూరు కోర్టు ఎదుట హాజరు కావొద్దని నిర్ణయించుకున్నప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమె హాజరు కాక తప్పలేదు. మూడు దశాబ్దాలకు పైగా జయలలితకు సన్నిహితురాలిగా ఉన్న శశికళ, పార్టీలో మంత్రులను, నేతలను తన అదుపులో ఉంచుకోవడం గమనించిన తర్వాతే జయలలిత వారిని బహిష్కరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications