Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సాక్షిపై పరువు నష్టం దావా వేస్తా: శివరామ

Shivarama Subrahmanyam
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షిపై దావా వేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం బుధవారం హెచ్చరించారు. ఆయన బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తన అవినీతి బయటపడుతుండటంతో ప్రజలను, సిబిఐని పక్కదోవ పట్టించేందుకు జగన్‌ సాక్షి పత్రిక లేనిపోని కథనాలు ప్రచురిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు. ఎపిఐఐసి అక్రమాల విషయంలో మాజీ ఎపిఐఐసి చైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సాక్షో లేక ముద్దాయో త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు.

కాగా అంతకుముందు రోజు ఆయన అదే పత్రిక తీరుపై మండిపడ్డ విషయం తెలిసిందే. తాను దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు నిరూపిస్తే కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉరేసుకుంటానని ఆయన సవాల్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసును పక్కదారి పట్టించేందుకే తనపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. విల్లాలు కొనుగోలు చేసినవారిని విచారిస్తే ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉందనేది బయటపడుతుందని ఆయన అన్నారు. తాను గానీ, ఎపిఐఐసి మాజీ మైనేజింగ్ డైరెక్టర్ గానీ దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరామని చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాము దుబాయ్‌లో విల్లాలు కావాలని కోరినట్లు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చెందిన విజయ రాఘవన్ తదితరులు చెప్పినట్లు అఫిడవిట్ దాఖలైందని వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తమపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపసంహరించుకోకపోతే వాటిని రుజువు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+