అధికార దాహంతోనే జగన్ పార్టీ వీడారు: ముఖ్యమంత్రి

Kiran kuamar Reddy
తిరుపతి: అధికార దాహంతోనే ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీని వీడారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ కడప డిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. షెడ్యూల్ ఖరారు చేసుకుని పిలిస్తే తాను ప్రచారానికి వస్తానని ఆయన చెప్పారు.

కడప జిల్లాలో జరిగే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి హాజరు కాలేదు. కడప జిల్లా కార్యకర్తల సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించడమే కాకుండా కడపకు రావడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+