చంద్రబాబు మిమిక్రీ ఆర్టిస్టులా మారారు: లక్ష్మీ పార్వతి

వ్యవసాయం తర్వాత చేనేతకు దేశంలో ప్రాధాన్యత ఉందన్నారు. దానిని విస్మరించవద్దన్నారు. ఎన్టీఆర్, వైయస్ తర్వాత ప్రజా సమస్యలపై ఎవరైనా స్పందించారా అని ప్రశ్నించారు. జగన్ మాత్రమే వారి దారిలో నడుస్తున్నారన్నారు. బాబు హయాంలో చేనేత రంగం ఎంతగా క్షీణించిందో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై జగన్ దీక్షలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నారన్నారు. చేనేత రంగ పరిష్కారానికి కాంగ్రెసు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైయస్ రూ.350 కోట్లు విడుదల చేస్తే రూ.150 కోట్లు ఇచ్చి కిరణ్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కిరణ్ బాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications