అసెంబ్లీలో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల ప్రతిపక్ష పాత్ర

స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన వేటు విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని మరో నేత బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ముందే మేము విప్ ధిక్కరించి ప్రభుత్వానికి ఓటు వేశామని, అయినప్పటికీ ఇంత జాప్యం చేయడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా స్పీకర్ తమపై సరైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకేసారి 24 నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని భావించే ప్రభుత్వం వేటుకు వెనుకాడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందనే భయం కాంగ్రెసును పట్టుకుందన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. సమస్యలు వెలికి తీయాల్సిన గవర్నర్ ప్రసంగం అలా లేదన్నారు.












Click it and Unblock the Notifications