ఘనంగా శివరాత్రి వేడుకలు, కిక్కిరిసిన దేవాలయాలు

హైదారాబాద్: శివరాత్రి పర్వదినం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. శివుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మూలాపేట మూలస్థానేశ్వరాలయంలో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీరి కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పంచారామక్షేత్రమైన ఉమాసోమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుండే భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం స్వామి వారికి వేదమంత్రాల మధ్య పాలాభిషేకం చేశారు. సుమారు 50వేల మంది భక్తుల వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశముంది. ఈ ఉత్సవాలు ఐదురోజుల పాటు జరుగుతాయి.

శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు తరలి వచ్చారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుట్టపర్తిలో రుద్రాభిషేకం చేశారు. ఈ అభిషేకంలో మంత్రి గీతా రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, రుద్రాభిషేకాలు, రాత్రి 12 గంటలకు భ్రమరాంభికా సమేత మల్లికార్డున స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. వేములవాడలో సాయంత్రం ఆరుగంటలకు సహస్ర లింగార్చన ఉంటుంది.

గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్‌ దేవాలయం కిటకిటలాడుతోంది. శ్రీకాళహస్తిలో ముక్కంటిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మెదక్ జిల్లా ఏడుపాయలు జాతరకు ముస్తాబైంది. ఈ జాతరకు సుమారు ఐదు నుండి ఏడు లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+