అప్పుడే వద్దు: అంజన్, ముఖేష్ల వివాదంపై బొత్స
కాగా గత రెండు రోజులుగా గ్రేటర్ కాంగ్రెసులో పార్లమెంటు చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తన తనయుడు గోషా మహల్ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ధీటుగా స్పందించారు. తన నియోజకవర్గంపై కన్నేస్తే అడ్డంగా నరికేస్తానని హెచ్చరించారు. ఇద్దరి మధ్య పరోక్ష యుద్ధం నడిచింది. మరోవైపు కాంగ్రెసు ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి తాము వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. మరో ఎమ్మెల్యే బండారు రాజి రెడ్డి కూడా ఎంపి సర్వే సత్యనారాయణపై ధ్వజమెత్తారు. దీంతో గ్రేటర్ కాంగ్రెసులో చిచ్చు రాజుకుంది. ఈ అంశంపై బొత్స గురువారం స్పందిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
botsa satyanarayana anjan kumar yadav mukesh goud hyderabad బొత్స సత్యనారాయణ అంజన్ కుమార్ యాదవ్ ముఖేష్ గౌడ్ హైదరాబాద్
English summary
PCC chief Botsa Satyanarayana responded minister Mukesh Goud and MP Anjan Kumar Yadav issue.
Story first published: Thursday, March 1, 2012, 11:38 [IST]