మీనా, శివరాంలపై ఎసిబి కేసు, ఎమ్మార్ స్కామ్
విల్లాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి సుమారు 6,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, అయితే అవి నిలిచిపోయేలా ఉత్తర్వులు జారీ చేయించడం వల్ల అందులో పదిశాతం వాటాను ఏపీఐఐసీ నష్టపోయిందని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చడం, అవినీతి ఆరోపణలపై శివరామసుబ్రహ్మణ్యం, బీఆర్ మీనాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించాలంటూ సాయినాథ్ కోర్టును కోరారు. ఆమేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మార్ విల్లాలు, ప్లాట్లను షరతులతో కూడిన రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీఐఐసీ అధికారుల బృందం సీబీఐ అధికారులను కలిసింది. ఇదే అంశంపై వారు చర్చించినట్లు సమాచారం. ఎమ్మార్ కేసుకు సంబంధించి అధికారులు సీబీఐ కోర్టులో త్వరలోనే అదనపు చార్జ్షీట్ను దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మార్-ఎంజీఎఫ్ ప్రతినిధులు కూడా సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్పిక్ ప్రాజెక్టు ప్రతినిధులు, కొందరు బ్యాంకు అధికారులను సీబీఐ విచారించింది.