వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్, పదిహేనుమంది మావోల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chhattisgarh
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దాదాపు 15 మంది మావోయిస్టులు మృతి చెందారని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వంగానీ, మావోయిస్టులుగానీ ఇంకా ద్రువీకరించలేదు. 24న భారత్ బంద్ సందర్భంగా భారీ విధ్వంసానికి మావోయిస్టులు రూపకల్పన చేశారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దానికి తోడు మానవ రహిత విమానాల ద్వారా మావోయిస్టుల జాడ పసిగట్టిన కేంద్ర హోం శాఖ కోబ్రా దళాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్-నారాయణపూర్ జిల్లాల అటవీ ప్రాంతంలోని అబూజ్‌మడ్‌లో నాలుగు రోజులుగా కోబ్రా బలగాలు ముమ్మర గాలింపులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మావోయిస్టులకు - కోబ్రా బలగాలకు ఎదురు కాల్పులు కూడా జరిగాయి.

ఈ ఘటనలో ముగ్గురు కోబ్రా జవాన్లు గాయపడ్డారు. దీంతో బస్తర్ ఐజీ లాంకుమేర్, ఎడిసి రాంనివాస్ నేతృత్వంలో మరిన్ని బలగాలు శనివారం నుంచి భారీగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే శనివారం అబూజ్‌మడ్ సమీపంలో మావోయిస్టులపై కోబ్రా దళాలు దాడి జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 15 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కేంద్రం సమీప రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. సరిహద్దులో బలగాలను మో హరించాలని సూచించింది. అబూజ్‌మాడ్ ప్రాంతంలో సరైన సమాచార వ్యవస్థ లేనందున అక్కడి విషయాలను పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు తిరిగి వస్తేనే అసలు వివరాలు తెలిసే అవకాశముంది.

English summary
Fifteen maoists dead in encounter in Chhattisgarh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X