ప్రభుత్వాన్ని కాపాడుతుంది ఎవరు?: ఎంఐఎంపై టిడిపి

Gali Muddu Krishnama Naidu - Revanth Reddy
హైదరాబాద్: ఎంఐఎం తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతి రాజు సోమవారం టిడిపి కార్యాలయంలో ధ్వజమెత్తారు. సభలో ఎంఐఎం ప్రభుత్వాన్ని కాపాడుతోందని విమర్శించారు. తాము కాంగ్రెసు ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం పార్టీయే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పార్టీ సభలో టిడిపి, కాంగ్రెసు ఒక్కటయ్యాయని విమర్శించటం హాస్యాస్పదమన్నారు. ప్రజా సమస్యలు విస్మరించిన కాంగ్రెసును కాపాడుతున్న ఎంఐఎంకు తమ పార్టీని, పార్టీ అధినేతను విమర్శించే హక్కు లేదన్నారు. బాబు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎవరినో ఒకరిని ప్రవేశ పెడుతోందన్నారు. అక్బరుద్దీన్ మాటలు దురదృష్టకరమన్నారు.

చంద్రబాబు మాట్లాడుతుండగా ఎంఐఎం కార్నర్ చేస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం సభను వాయిదాలు వేయిస్తోందన్నారు. 26 జివోలకు సుప్రీం కోర్టు నుండి నోటీసుల అంశంపై ఆరో రోజు కూడా ప్రభుత్వం చర్చించకుండానే వెళ్లి పోయిందన్నారు. బాబుకు నిరసన చెప్పే అవకాశమే దొరకలేదన్నారు. 2004 నుంచి కాంగ్రెసు అవినీతిపై తాము పోరాడుతున్నామన్నారు. అప్పుడు అక్బరుద్దీన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. వివాదాస్పద ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+