చిరు స్టార్ కాంపెయినర్, కెకె తీరు వల్లే రాలేదు: బొత్స
తెల్ల కార్డులు ఉన్న వారికి మద్యం దుకాణాలు ఉన్నాయని ఇటీవల ఓ పేపర్లో వచ్చిందని బొత్స సత్తిబాబు ఈ సందర్భంగా అన్నారు. అందుకే మద్యం దుకాణాలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే రద్దు చేయాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవ రావుకు రాజ్యసభ ఇవ్వాలని మేం అధిష్టానాన్ని కోరామని చెప్పారు. అయితే తెలంగాణ విషయంలో ఆయన వ్యవహార శైలి వల్లే టిక్కెట్ రాలేదని భావిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. కాగా చిరంజీవి, రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు సోమవారం రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జివోల విషయంలో ఎవరూ తప్పు చేయలేదన్నారు. తెర వెనుక జరిగే లాలూచీలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ వర్గం నేతల ఖాళీతో ఏర్పడిన పదిహేడు నియోజకవర్గాలతో పాటు తిరుపతి స్థానానికి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలను అమ్ముకుందని ఆరోపించారు.