హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కేసు:సిబిఐ ఎదుట సాక్షి ప్రతినిధి, ప్రకటనలపై ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంగళవారం జగతి పబ్లికేషన్స్ మార్కెటింగ్ డైరెక్టర్, మరికొన్ని మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు సిబిఐ ఎదుట హాజరయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో జగన్ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున విచారణను సిబిఐ వేగవంతం చేసింది. సాక్షి ప్రకటనల విభాగం ప్రతినిధి రాణి రెడ్డి సిబిఐ ఎదుట హాజరై వివరాలు సమర్పించారు. సాక్షికి ప్రకటనల జారీలో మధ్యవర్తిగా వ్యవహరించిన కొన్ని ప్రయివేటు యాడ్ ఏజెన్సీలను కూడా సిబిఐ మరోమారు పిలిచి ప్రశ్నించింది. సాక్షి పత్రిక, సాక్షి టివిలకు జారీ అయిన ప్రకటనలపై వారి వివరణను తీసుకుంది.

ప్రకటనల నిడివి, ఎంత ఖర్చుతో జారీ చేశారన్న విషయాలపై సిబిఐ అధికారులు ఆరా తీశారని సమాచారం. దీనిపై ఇప్పటికే సమాచార పౌరసంబంధాల మాజీ కమిషనర్, ఐఏఎస్ అధికారి పార్థసారధితో పాటు ఆ శాఖ డైరెక్టర్లను కూడా సిబిఐ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటల్ని జారీ చేసేందుకు ఎవరు ఒత్తిడి తెచ్చారన్న విషయాన్ని అధికారులు ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సోమవారం న్యూఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్‌తో భేటీ అయి జగన్ కేసులో పురోగతిని వివరించిన విషయం తెలిసిందే.

English summary
Sakshi marketing officials attended before CBI today in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X