మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్కను కొట్టాడని ఓ యువకుడిని కాల్చి చంపారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak Map
సంగారెడ్డి: కుక్కను కొట్టాడని ఓ యువకుడిపై కిరోసిన్ పోసి తగుల బెట్టి చంపిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగింది. నాలుగు రోజుల కిందటే ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 22వ తేదీన ఆ సంఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం - పక్క పక్కన ఇళ్లు గల దుర్గమ్మ, అమృత, నర్సింలకు చెందిన కుక్క గుడుపల్లి మల్లేశం (19) అనే వ్యక్తి ఇంటిలోని వెళ్లి అక్కడున్న బకెట్‌లో నీరు తాగింది. దీంతో ఆగ్రహించిన మల్లేశం కుక్కను కొట్టాడు. ఇది గమనించిన దుర్గమ్మ, అమృత, నర్సింలు మల్లేశం అతన్ని కొట్టారు. దాంతో ఆగకుండా అతనిపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.

బాధితుడు గత నాలుగు రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాసను విడిచాడు. సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన మృతును కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
youth was killed for beating dog at Sangareddy of Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X