వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రురాలి ఇంటి టెర్రాస్‌పై నుంచి పడి టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie dies after falling from terrace
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించాడు. తూర్పు ఢిల్లీలోని తన మిత్రురాలి ఇంటి టెర్రాస్‌పై నుంచి పడి పాతికేళ్ల టెక్కీ మరణించాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడిని సౌరవ్‌గా గుర్తించారు. అతను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు రాబట్టడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చేస్తున్న సౌరవ్ స్నేహితురాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు.

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం - స్నేహితురాలు ఓ పార్టీకి వెళ్లి తిరిగి వచ్చే సరికి సౌరవ్ మద్యం సేవిస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆమె కిందికి దిగి వస్తుండగా పైనుంచి కిందికి ఏదో పడిన శబ్దం వినిపించింది. చూసేసరికి సౌరవ్ రక్తం మడుగులో పడి ఉన్నాడు.

స్థానికులు చూసి అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే అది రాలేదు. దీంతో సౌరవ్ స్నేహితురాలు నోయిడాలోని తనకు తెలిసిన ఫ్రెండ్‌ను పిలిచింది. ఆదివారం పదిన్నర గంటలకు సంఘటన జరిగితే అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు తమకు విషయం చెప్పారని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 25 - year software engineer was killed after he fell from the terrace of female friend house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X